Thursday, April 25, 2024

Follow up | నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

2022 సంవత్సరానికి స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో గుడ్‌బై చెప్పాయి. శుక్రవారం నాడు జరిగిన ఈ సంవత్సరం చివరి ట్రేడింగ్‌లో సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ప్రతికూల సంకేతాలతో మధ్యాహ్నం తరువాత క్రమంగా నష్టాల్లోకి వెళ్లాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్‌ 293.14 పాయింట్ల నష్టంతో 60840.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 85.70 పాయింట్ల నష్టంతో 18105.30 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 33 రూపాయల పెరిగి 55004 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో దర 549 రూపాయల తగ్గి 69218 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.82 రూపాయిలుగా ఉంది.

లాభపడిన షేర్లు

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌ కంపెనీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, విప్రో, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, హీరో మోటో కార్ప్‌, టెక్‌ హీంద్రా, దివిస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు

ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ అండ్‌టీ, నెస్లే ఇండియా, ఐటీసీ, ఎం అండ్‌ ఎం, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయంట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మారుతీ సుజుకీ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, అపోలో ఆస్పటల్స్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement