Friday, April 19, 2024

Follow up | లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం నష్టాల్లోకి వెళ్లాయి. కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్న మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్‌లో వచ్చిన కొనుగోళ్ల మద్దతు సూచీలు లాభాల్లో ముగిసేందుకు కారణమయ్యాయి. వారం రోజులుగా మార్కెట్లు నష్టాల్లోనే నడుస్తున్నాయి. దీంతో కీలక కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

సెన్సెక్స్‌ 355.06 పాయింట్ల లాభంతో 57989.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.45 పాయిం ట్ల లాభంతో 17100.05 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 431 రూపాయలు పెరిగి 58437 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 615 రూపాయలు పెరిగి 67146 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.61 రూపాయిలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు..

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ, విప్రో, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ కంపెనీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అపోలో ఆస్పటల్స్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో, కోల్‌ ఇండియా షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

ఐటీసీ, మారుతీ సుజుకీ, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, దివిస్‌ ల్యాబ్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement