Wednesday, April 24, 2024

రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు..

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 10 సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనుంది. దీనిలో భాగంగా ట్రైన్‌ నెం 07091 కాజిపేట – తిరుపతి రైలు మే 31, జూన్‌ 7, 14, 21, 28వ తేదీలలో ఉదయం 11 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10.20 గంటలకు చేరుకోనుంది. అదే విధంగా 07092 తిరుపతి – కాజిపేట రైలు రాత్రి 11.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు చేరుకోనుంది.

మార్గమధ్యంలో వరంగల్‌, కే సముద్రం, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మధ్య ఆగనుంది. దీనిలో ఏసీ 2, 3 టైర్‌, స్లీపర్‌ క్లాస్‌లు, జనరల్‌, సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement