Tuesday, April 23, 2024

మంగ‌ళూరు ఆటో పేలుడులో ఉగ్ర‌కోణం..

క‌ర్నాట‌క : మంగళూరు ఆటోరిక్షా పేలుడు కేసులో యాక్ట్ ఆఫ్ టెర్రర్ గా పేర్కొన్నారు కర్ణాటక పోలీసులు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉన్న‌ట్లు పోలీసులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆటో పేలుడు ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగింది కాద‌ని, ఉగ్రవాద కుట్ర అనే కోణంలో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని డీజీపీ తెలిపారు. భారీ పేలుళ్ల‌కు కుట్ర ప‌న్నిన‌ట్లు అనుమానాలు ఉన్నాయ‌ని, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో విచార‌ణ జ‌రుపుతున్నామ‌న్నారు. ఇప్ప‌టికే విచార‌ణ కొన‌సాగుతుంద‌న్నారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి ఆస్ప‌త్రిలో చికిత్స అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రెండు రోజుల్లో ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని క‌ర్నాట‌క హోం మంత్రి జ్ఞానేంద్ర తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement