Thursday, April 25, 2024

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం.. హాజరుకాని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు

ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ సమక్షంలో శనివారం ఉదయం ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. దీంతో, ‘మా’లో నూతన కార్యవర్గం కొలువుదీరింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో  నిర్వహించిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని.. కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ‘మా’ కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణుకి మద్దతుగా ఉన్న నరేశ్‌ సైతం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘మా’ ఎన్నికలు తెరపైకి వచ్చిన నాటి నుంచి మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్స్ మధ్య మాటల దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల విష్ణు ప్యానెల్‌ సభ్యులతో కలిసి పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి ప్రకాశ్‌రాజ్‌, అతని ప్యానెల్‌ సభ్యులెవరూ హాజరు కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement