Wednesday, April 24, 2024

పాత్రలను పరిచయం చేసిన సంతోష్ శోభన్ ‘మంచిరోజులు వచ్చాయి’

‘ఏక్ మినీ కథ’తో యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న సంతోష్ శోభన్ తాజాగా ‘మంచిరోజులు వచ్చాయి’ అనే చిత్రంతో ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ మూవీలో పాత్రల పేరు, ఆర్టిస్టులను చూస్తుంటే దర్శకుడు మారుతి ప్రధానంగా కామెడీతోనే సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.

‘మీరు భయానికి భయపడి ఎంతదూరం పారిపోతే.. అది మీకు అంత దగ్గరవుతుంది’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో సంతోష్ శోభన్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. వి సెల్యూలాయిడ్ పతాకంపై యూవీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, వైవా హర్ష, సుదర్శన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

YouTube video

ఈ వార్త కూడా చదవండి: పూరీకే బాలయ్య ఫస్ట్ ఛాన్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement