Friday, April 19, 2024

అప్పులు తీర్చ‌లేక ఆలినే….

ఓ వ్యక్తి ఆర్థికంగా చితికిపోయాడు. పూటగడవడం కూడా కష్టం అయ్యింది. దీంతో త‌న అవసరాలు తీర్చుకునేందుకు తెలిసిన వారి వద్ద నుంచి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తికి వడ్డీ భారం పెరిగిపోయింది. అప్పు ఇచ్చిన వాళ్లు సోమ్ము తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. అతడి వద్ద డబ్బుల్లేవు.. దీంతో తాను ఏం చేశాడంటే..

లక్ష రుపాయలకు తన భార్యను అమ్మిన ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని గున ప్రాంతంలో జ‌రిగింది. అప్పు తీసుకున్న వారితో ఈమేర‌కు బేరం కుదుర్చుకున్నాడు. అప్పుల వాళ్ల వద్దకు తన భార్యను తీసుకెళ్లి అప్పజెప్పాడు. అప్ప‌టిదాకా భార్య‌కు విష‌యం తెలియ‌నీయ‌లేదు. భర్త తనను అమ్మేశాడని తెలుసుకున్న భార్య షాక్‌కి గుర‌య్యింది. ​తనను విక్రయించడాన్ని వ్యతిరేకించి, అక్కడినుంచి వెళ్లి పోయింది. దీంతో ఆవేశానికి గురైన స‌ద‌రు భర్త ఆమెను చంపేయ‌డానికి కూడా యత్నించాడు. ఇంట్లో నిద్రపోతున్న భార్యను తీసుకెళ్లి బావిలో పడేశాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ ఆ మహిళ తన తండ్రితో కలిసి పోలీసులకు కంప్లెయింట్‌ చేసింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement