Friday, March 29, 2024

సెల్‌ఫోన్ రిపేర్ విషయంలో ఘర్షణ.. వ్యక్తి హత్య

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గుర‌య్యాడు. ఏపీలోని ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు వంగపల్లిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో కొండయ్య తన మొబైల్ ఫోన్ రిపేర్ కోసం సీతయ్యను రూ.3 వేలు అడిగాడు. దీనికి సీతయ్య నిరాకరించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఎవ‌రి ఇంటికి వారు వెళ్లిపోయారు. ఈ క్ర‌మంలో సీతయ్య తన ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా.. గొడ‌వ‌ను మ‌న‌సులో పెట్టుకున్న కొండయ్య ఒక ఇనుప రాడ్ తీసుకొని వెళ్లి నిద్రిస్తున్న సీతయ్య తలపైన బలంగా కొట్టాడు. దీంతో సీత‌య్య‌ అక్కడిక‌క్క‌డే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు కొండయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement