Friday, April 26, 2024

కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించి క‌ల‌క‌లం రేపాడు ఓ యువ‌కుడు. దీంతో ఆ యువ‌కుడిని అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. వెంట‌నే స్థానికులు బాధితులు ముగ్గురిని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించి నిందితుడు న‌ర్వకు చెందిన రాంబాబు అని చెప్పారు.

ఇటీవ‌ల యువ‌తితో రాంబాబుకు వివాహం నిశ్చ‌య‌మైంది. అయితే ఆ యువ‌తి మ‌రో యువ‌కుడితో మాట్లాడుతోంద‌ని రాంబాబు ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. చివ‌ర‌కు పెళ్లి ర‌ద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఇరు కుటుంబాల మ‌ధ్య ఘర్షణ తలెత్తింది. గురువారం రాత్రి ఇరు కుటుంబాల‌ను పిలిచి పోలీసులు రాజీ కుద‌ర్చ‌డంతో పోలీసుల సూచ‌న‌ల‌తో వివాహం చేసుకునేందుకు రాంబాబు ఒప్పుకున్నారు. అయితే, మ‌ళ్లీ ఏం జ‌రిగిందో తెలియరాలేదు. గురువారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో యువ‌తిపై దారుణానికి పాల్ప‌డ్డాడు రాంబాబు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: తిరుమలలో ఏపీ మంత్రుల హల్‌చల్.. భక్తుల ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement