Saturday, April 20, 2024

ఇది ప్రజల విజయం: మమతా బెనర్జీ

పశ్చిమ్‌బెంగాల్‌లో తృణమూల్‌ విజయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ విజయాన్ని ప్రజల విజయంగా ఆమె అభివర్ణించారు. నందిగ్రామ్‌లో గెలుపొందిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తృణమూల్‌ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని పార్టీ శ్రేణులను కోరారు. ‘విజయం ముఖ్యం కాదు.. కరోనాను ఎదుర్కోవడమే ముఖ్యం’ అని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు పశ్చిమ్‌బంగాల్‌లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. మొత్తం 292 స్థానాలకు గానూ 114 స్థానాల్లో తృణమూల్‌ విజయం సాధించగా.. మరో 103 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా 32 చోట్ల విజయం సాధించి.. 41చోట్ల ఆధిక్యంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement