Monday, April 15, 2024

వింటేజ్ దీదీ ఫోటో వైరల్

బెంగాల్ లో ముచ్చ‌ట‌గా మూడోసారి అధికార పీఠం ఎక్క‌బోతున్నారు మమతా బెనర్జీ. అయితే నందిగ్రామ్ ఓట‌మిని ఆమె లైట్ తీసుకున్నారు. ఈ విజ‌యం ఆమెను సోష‌ల్ మీడియాలోనూ స్టార్‌ను చేసింది. ఎన్నిక‌ల ఫలితాలు వ‌చ్చిన రోజున ఆమె గెలుపు దాదాపు ఖాయ‌మైన త‌ర్వాత 1980నాటి మ‌మ‌త ఫొటో ఒక‌టి తెగ వైర‌ల్ అవుతోంది. ట్విట‌ర్‌లో ఇండియ‌న్‌హిస్ట‌రీపిక్స్ అనే హ్యాండిల్ ఈ ఫొటోను పోస్ట్ చేసింది. అప్ప‌టి నుంచి ఆమెను ఆకాశానికెత్తుతూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందిరా గాంధీ త‌ర్వాత భార‌త రాజ‌కీయాల‌ను శాసించిన మ‌హిళ మ‌మ‌త‌నే అని ఒక‌రు కామెంట్ చేశారు. భార‌త రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఆమెకు ప్ర‌త్యేకంగా ఒక పేజీ ఉంటుంద‌ని మరొక‌రు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement