Friday, April 26, 2024

త్వరలో గుజరాత్‌లో మల్లికార్జున ఖర్గే పర్యటన..


గుజరాత్‌లో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఇప్పటికే అధికార పార్టీ బీజేపీ ప్రచారం మొదలు పెట్టగా.. అదేవిధంగా అక్కడి లోకల్‌ పార్టీల నేతలు సైతం ప్రచారం మొదలు పెట్టారు. ఈసారి గుజరాత్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. గుజరాత్‌ ఎన్నికలను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోడీని ఢీకొట్టాలంటే గుజరాత్‌లో విజయం సాధిస్తేనే సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ భావిస్తుంది. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి గుజరాత్‌ కాంగ్రెస్‌ భారీ ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement