Thursday, March 28, 2024

లైంగిక‌ దాడి కేసులో – కోర్టుకి హాజ‌రుకానున్న దిలీప్ కుమార్

మ‌ల‌యాళ హీరోయిన్ పై లైంగిక దాడి కేసులో మ‌ల‌యాళ స్టార్ హీరో దిలీప్ కుమార్ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నాడు. 2017వ సంవ‌త్స‌రంలో హీరోయిన్ భావ‌న‌పై లైంగిక దాడి కేసులో దిలీప్ ప్ర‌ధాన నిందితుడు. ప్రస్తుతం దీనితో పాటు… దర్యాప్తు అధికారులపై దాడికి కుట్ర పన్నిన క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి దిలీప్‌ను విచారిస్తున్నారు. అయితే కేరళ హైకోర్ట్ దిలీప్ కు ఈనెల 27 వరకు అరెస్ట్ నుంచి రిలీఫ్ ఇచ్చింది. ఇటీవల తనపై దాడికి సంబంధించి విచారణను వేగవంతం చేయాలని.. తనకు న్యాయం చేయాలని భావన కేరళ సీఎం పినరయి విజయన్ కు లేఖ రాసింది. దీంతో ఈ కేసులో ఒక్కసారిగా కదలిక వచ్చింది.

సాక్ష్యాలను ప్రభావితం చేయడంతో పాటు విచారణ అధికారులపై కుట్ర పన్నిని అభియోగాలను కూడా దిలీప్ ఎదుర్కొంటున్నాడు. దీంతో 23 నుంచి దిలీప్‌తో పాటు అతని సోదరుడు, బావ, ఇద్దరు స్నేహితులు సహా నలుగురు సహచరులను ఆదివారం క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని కేరళ హైకోర్టు శనివారం ఆదేశించింది. జనవరి 27 వరకు నిందితులను అరెస్టు చేయబోమని, జనవరి 23 నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారిస్తామని కోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుల విచారణ, జనవరి 27న జరిగిన విచారణపై నివేదికను తమ ముందు ఉంచాలని ప్రాసిక్యూటర్‌ను కోర్టు ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement