పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో నిర్మాణమవుతున్న డ్రైనేజీలు, సిసి రోడ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, పనుల్లో కచ్చితమైన నాణ్యత పాటించాలన్నారు.
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లా కేంద్రానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..