Friday, April 26, 2024

మ‌హేశ్ బాబు మోకాలికి శ‌స్త్ర చికిత్స‌

సూపర్ స్టార్ మ‌హేశ్‌బాబుకు మోకాలికి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో కుటుంబ స‌మేతంగా మ‌హేశ్‌బాబు స్పెయిన్ వెళ్లారు. శ‌స్త్ర చికిత్స ముగిసిన అనంత‌రం ఆయ‌న దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం మ‌హేశ్‌బాబు స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌హేశ్‌బాబు లేని స‌న్నివేశాల‌ను చిత్ర యూనిట్ చిత్రీక‌రిస్తోంది. 2022, ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవ‌కాశముంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో స‌ర్కారు వారి పాట సినిమా విడుద‌ల కానుంది. ​భారీ బడ్జెట్ తో బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement