ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు హీరో మహేశ్ బాబు.కాగా ఆయన తన నెక్ట్స్ ఫిల్మ్ ని దర్శకుడు త్రివికమ్ డైరెక్షన్ లో చేయనున్నాడు. అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి..ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా మహేష్ న్యూ లుక్ లో మెరిశారు. Loving the new vibe పేరుతో న్యూ లుక్ లో ఉన్న పిక్ ను తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు మహేష్ బాబు.
Advertisement
తాజా వార్తలు
Advertisement