Saturday, March 23, 2024

Breaking | పెద్దపల్లి ఏసీపీగా మహేష్.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ

పెద్దపెల్లి ఏసీపీగా ఎడ్ల మహేష్ ను నియమిస్తూ తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బెల్లంపల్లి ఏసీపీగా పనిచేస్తున్న ఆయన పెద్దపెల్లికి బదిలీపై వస్తున్నారు. పెద్దపెల్లిలో ఇప్పటికే డ్యూటీలో ఉన్న ఏసీపీ సారంగపాణిని చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని డీజీపీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహేష్ గతంలో పెద్దపల్లి సీఐగా పనిచేశారు. ఏసీపీగా తిరిగి ఇక్కడికే నియామకం కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement