Tuesday, March 26, 2024

టిడిపిలోకి మ‌హాసేన రాజేశ్‌.. ఎవ‌రూ త‌ప్పుగా మాట్లాడొద్దు.. నాగ‌బాబు

ఈ నెల 16న టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో ఆ పార్టీలో చేర‌నున్నారు మ‌హాసేన రాజేశ్.ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా చంద్రబాబు పెద్దాపురం రానున్నారు. ఈ సందర్భంగా మహాసేన రాజేష్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన తొలుత జనసేనలోకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే, టీడీపీలో చేరుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. మహాసేన రాజేష్ గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడకండి అంటూ ట్వీట్ చేశారు. అతను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడనేది అతని ఇష్టం… అది తన ప్రజాస్వామ్య హక్కు అని నాగబాబు స్పష్టం చేశారు. అతడి నిర్ణయం ఎలాంటిదైనా గౌరవించాలని, అతడికి శుభాకాంక్షలు తెలపాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement