Thursday, April 18, 2024

సిద్ధార్థ్, శర్వానంద్ ‘మహాసముద్రం’ ట్రైలర్

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేం దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహాసముద్రం’ సినిమా ట్రైలర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమాలో కథానాయికలుగా అదితీ రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ నటించారు. లవ్, యాక్షన్, ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

నువ్వు సముద్రం లాంటివాడివి అర్జున్ .. నీలో కలవాలని అన్ని నదులు కోరుకుంటాయ్, మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా అనే డైలాగులు ఆకట్టుకున్నాయి. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్, శరణ్య ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. కొంతకాలంగా శర్వానంద్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతడు ఆశిస్తున్న సక్సెస్ ఈ సినిమాతో లభిస్తుందేమో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement