Saturday, April 20, 2024

భారీ వర్షాలతో 14 రైళ్లు రద్దు..

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని ఇగత్‌పరి-లోనావాలా, కొల్హాపూర్-మిరాజ్ సెక్షన్ల మధ్య కొండచరియలు విరిగిపడడంతో 14 రైళ్లను రద్దు చేసింది. శనివారం నుంచి ఈ నెల 28 వరకు నాలుగు రైళ్లను ఒక్కో రోజు రద్దు చేయగా, మిగతా పది రైళ్లను నాలుగు రోజుల చొప్పున రద్దు చేశారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో బయల్దేరిన వెరవల్-తిరువనంతపురం, చండీగఢ్-కొచ్చువేళి, హిస్సార్-కోయంబత్తూరు రైళ్లతోపాటు, ముంబై-తిరువనంతపురం మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించారు.

శుక్రవారం బయల్దేరాల్సిన తిరుపతి-కొల్హాపూర్, 26న బయల్దేరాల్సిన హౌరా-వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. అలాగే, ఎర్నాకుళం-హజ్రత్ నిజాముద్దీన్, పోర్‌బందర్-కొచ్చవేళి, కేఎస్ఆర్ బెంగళూరు-అజ్మీర్ రైళ్లను దారి మళ్లించారు. రద్దయిన రైళ్లలో ఆదిలాబాద్-సీఎస్‌టీ ముంబై, సీఎస్‌టీ ముంబై-ఆదిలాబాద్, హైదరాబాద్-సీఎస్‌టీ ముంబై, సీఎస్‌టీ ముంబై-హైదరాబాద్, సికింద్రాబాద్-ఎల్‌టీటీ ముంబై, ఎల్‌టీటీ ముంబై-సికింద్రాబాద్ రైళ్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement