Friday, April 19, 2024

28వ రోజుకు చేరిన అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర‌

రాజ‌ధాని సాధ‌న కోసం అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర ఇంకా కొన‌సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న వీరి పాద‌యాత్ర ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఆదివారం నాటికి 28వ రోజుకు చేరింది. వీరికి ప్ర‌జ‌ల నుంచే కాక స్థానిక నేత‌ల నుంచి కూడా భారీగానే మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఆయా జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న‌ప్పుడు ప‌లు పార్టీల నేత‌లు కూడా వీరికి మ‌ద్ద‌తుగా పాద‌యాత్ర‌లో పాల్గొంటూ ప్ర‌సంగిస్తున్నారు. ఇవాళ పాలకొల్లు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. భారీ వర్షంలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పాలకొల్లు బ్రాడీపేట బైపాస్‌ నుంచి జిన్నూరు, కవిటం మీదుగా జగన్నాథపురం వరకు సాగుతుంది. అక్కడ భోజన విరామం తర్వాత మార్టేరు మీదుగా పెనుగొండ వరకు మొత్తం 14 కిలోమీటర్లు సాగుతుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement