Friday, March 29, 2024

కేటీఆర్.. నువ్వే కొత్త బిచ్చగాడివి: మధు యాష్కి

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ కాంగ్రెస్ నేతలను తిట్టడమే వీరు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు మధు యాష్కి. కాంగ్రెస్ నేతలను కొత్త బిచ్చగాళ్లుగా పేర్కొన్న కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త బిచ్చగాళ్లం తాము కాదని… నీవే కొత్త బిచ్చగాడివి కేటీఆర్ అని అన్నారు. రోజుకో వేషం వేసుకుంటూ, పూటకో అబద్ధం చెపుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నావని మండిపడ్డారు.కాంగ్రెస్ లో గెలిచి, అధికార పార్టీకి అమ్ముడుపోయిన నేతలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెపుతామని అన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయని… బీజేపీ, టీఆర్ఎస్ లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

ఇది కూడా చదవండి: సాగర్ లో ఆగిన విద్యుదుత్పత్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement