Tuesday, April 23, 2024

మదనపల్లి జంట హత్యల కేసు అప్డేట్… జైలుకు తల్లిదండ్రులు?

చిత్తూరుజిల్లా మదనపల్లి జంట హత్య కేసులో నిందితులుకు విశాఖలో మెరుగైన చికిత్స అందించారు. కన్న కూతుళ్లు ఆలేఖ్య, సాయి దివ్యలను అతిదారుణంగా తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా మదనపల్లి నుంచి వైద్యం నిమిత్తం విశాఖ తీసుకొచ్చిన పురుషోత్తం నాయుడు,పద్మజ లను డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అంగీకారం తెలిపారు.

కన్న కూతుళ్ల హత్య కేసులో పురుషోత్తం నాయుడు,పద్మజ ఇద్దరూ కూడా పశ్చాత్తాపం పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. విశాఖ మానసిక ఆసుపత్రి నుండి ఈ వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పురుషోత్తం నాయుడు, పద్మజలను మదనపల్లె సబ్ జైలు తరలింపుకు విశాఖ మెంటల్ హాస్పిటల్ వైద్యాధికారులు జైలు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రత్యేక భద్రత నడుమ విశాఖ నుంచి మదనపల్లి తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement