Saturday, April 20, 2024

కూలీల కొరతను తగ్గిస్తున్న యంత్రాలు..

షాబాద్‌, (ప్రభన్యూస్‌): ప్రస్తుతం పంటలు కొతకు రావడంతో కూలీలు కొరత ఉండటంతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం యంత్రాలను ఉపయోగించి చేతికొచ్చిన కంది, మొక్కజొన్న, వరి తదితర పంటలను యంత్రాల సహాయంతో పంటలను నూర్పిడి చేసుకుంటున్నారు. షాబాద్‌ మండలంలో ముఖ్యంగా ఖరీఫ్‌ సీజనల్‌లో వేసిన మొక్కజొన్న, కంది, వర్షాధార పంటలు రైతన్నలు సాగు చేశారు.

ఈ పంటలను యంత్రాల సాయంతో కోసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం పంటకు ఎకరాకు రూ. 2500చొప్పున యంత్రాలకు తీసుకుంటున్నారు. ఎక్కడ చూసిన పంటపొల్లలో యంత్రాలతో కోతలు కోస్తూ… రైతులు బీ జీగా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement