Friday, March 29, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజుల్లో త‌మిళ‌నాడులో మోస్త‌రు వ‌ర్షాలు, ఏపీకి ఎఫెక్ట్​ ఉండేనా?​

హిందూ మహా సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వెల్లడించింది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో మరింత బలపడుతుందని అధికారులు వెల్లడించారు. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ జనవరి 31 తేదీ నాటికి బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ఫిబ్రవరి 1 తేదీ నాటికి శ్రీలంక, ఆగ్నేయ బంగాళాఖాతానికి దగ్గరగా వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

అల్పపీడన ప్రభావంతో జనవరి 31 తేదీ నుంచి శ్రీలంకతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మరోవైపు రాగల 2 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పూర్తిగా పొడివాతావరణం నెలకొంటుందని అమరావతిలోని వాతావరణ విభాగం తెలియచేసింది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని.. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంటుందని వాతావరణ విభాగం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement