Thursday, March 28, 2024

విజయనగరం జిల్లాలో విషాదం.. నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజి వద్ద నాగావళి నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నది. రెండ్రోజుల క్రితం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప్రేమజంట సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపించారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు తోటపల్లి బ్యారేజీ వద్ద వెతగ్గా వారి ఆచూకీ దొరకలేదు. దీంతో ఆ జంట బ్యారేజీలో దూకి ఉండొచ్చని అనుమానించారు.

రెండు రోజులుగా గజ ఈతగాళ్ల సాయంతో నాగావళి నదిలో వెతికించగా బుధవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు పైకి తేలాయి. దీంతో పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను బొబ్బిలికి చెందిన రాకేష్‌,కురుపాంకు చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారని, కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. రెండ్రోజుల క్రితం స్కూటీపై బ్యారేజీ వద్దకు వచ్చిన ఈ జంట అక్కడే కాసేపు తిరిగి ఆ తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుని దాన్ని తమ వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. తమ చావుకు తన బావ మౌళి అనే వ్యక్తే కారణమంటూ ఆ బాలిక వాట్సాప్‌ స్టేటస్ పెట్టింది. వీరిద్దరూ ఒకరికొకరు చున్నీతో కట్టుకొని నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిద్దరి మృతితో రెండు కుటుంబాల్లో విషాధచాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. పురుషాంగం కోసుకున్న యువకుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement