Saturday, April 20, 2024

మూడు రోజుల్లో రూ.50 కోట్లు రాబట్టిన ‘లవ్‌స్టోరీ’

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్‌లలో సినిమా దూసుకుపోతోంది. తొలి వీకెండ్‌లో ఈ సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేసినట్లు బాక్సాఫీస్ రిపోర్టులు తెలియజేస్తున్నాయి. తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్, రూ.24.79 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఏరియాల వారీగా చూసుకుంటే నైజాంలో రూ.8.85 కోట్లు, సీడెడ్ రూ.2.77 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.2.13 కోట్లు, గుంటూరు రూ.1.13 కోట్లు, కృష్ణా రూ.87 లక్షలు, తూ.గో. రూ.1.06 కోట్లు, ప.గో.రూ.96 లక్షలు, నెల్లూరు రూ.54 లక్షలు, కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.1.78 కోట్లు, అమెరికా సహా రెస్టాఫ్ వరల్డ్ కలిపి రూ.4.7 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు వివరించాయి. ఒక్క మూడోరోజు అంటే ఆదివారం నాడు ఏపీ, తెలంగాణలో రూ.9.1 కోట్ల గ్రాస్, రూ.5.19 కోట్ల షేర్‌ను ఈ మూవీ కలెక్ట్ చేసింది. అమెరికాలో నాగచైతన్య సినిమాల్లో తొలిసారి ఒక మిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమా లవ్‌స్టోరీనే కావడం విశేషం. ఈ ఏడాది అమెరికాలో జాతిరత్నాలు వసూళ్లను లవ్‌స్టోరీ మూవీ ఇప్పటికే అధిగమించేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement