తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట దగ్గర ప్రేమికులు రైలు కిందపడి బలవన్మరణం చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులు భువనగిరి మండలం బస్వాపురం వాసులుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -