Tuesday, April 23, 2024

ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ట‌స్క‌ర్..ఇద్ద‌రు మృతి..

ఆగి ఉన్న లారీని ట‌స్క‌ర్ వాహ‌నం ఢీకొన‌డంతో ఇద్ద‌రు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఆదిభ‌ట్లలో చోటు చేసుకుంది. సిమెంటు తయారీలో ఉపయోగించే మట్టి లోడ్‌ లారీతో డ్రైవర్‌ జానకిరాములు మెదక్‌ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వెళుతున్నాడు. రావిర్యాల టోల్‌గేట్‌ వద్ద ఔటర్‌ రింగు రోడ్డుపై లారీని నిలిపాడు. రైల్వేలో ఉపయోగించే ఐరన్‌ లోడ్‌తో వేగంగా వచ్చిన టస్కర్‌ ఆ లారీని వెనుక నుంచి ఢీకొంది. టస్కర్‌లో ఉన్న ఇద్దరు సహాయకులు బిహార్‌ రాష్ట్రం గోపాల్‌గంజ్‌ జిల్లాకు చెందిన అనిల్‌ యాదవ్‌(34), ఉత్తర్‌ప్రదేశ్‌ బియోరా జిల్లాకు చెందిన విశాల్‌(22) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ ఉమేష్‌ మండల్‌ రెండు కాళ్లు విరగ్గా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement