Saturday, April 20, 2024

యాదగిరిగుట్టలో 10 రోజులు లాక్‌డౌన్

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాదగిరిగుట్టలో అధికారులు లాక్‌డౌన్ విధించారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి ఇది ప్రారంభ‌మ‌వుతుంది. బుధవారం నుంచి ప‌ది రోజుల‌పాటు అమ‌ల్లో ఉండ‌నుంది. ప్రతిరోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఆంక్ష‌లు విధిస్తున్నారు. దీంతో ప్ర‌తి రోజు ఉద‌యం 5 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వ్యాపారులు త‌మ వ్యాపార క‌లాపాలు కొన‌సాగించుకోవ‌చ్చ‌ని యాద‌గిరిగుట్ట మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ ఎరుక‌ల సుధ వెల్ల‌డించారు. లాక్‌డౌన్ నుంచి పాలు, పండ్లు, కూర‌గాయ‌లు, కిరాణం, మెడిక‌ల్ షాపులు మిన‌హాయింపు ఉంటుంద‌ని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు ఆత్మ‌కూరు(ఎం) మండ‌లంలో కూడా వారం రోజుపాటు లాక్‌డౌన్ అమ‌లులో ఉండ‌నుంది. ప్ర‌తిరోజు మధ్యాహ్నం 2 గంట‌ల నుంచి ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement