Thursday, April 18, 2024

కేరళలో సంపూర్ణ లాక్ డౌన్..

దేశంలో కరోనా తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇవాళ 40 వేల పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలకు సిద్దమవుతున్నాయి. ఇక కేర‌ళలో అయితే ప్ర‌తిరోజు 20 వేల‌కు పైగా క‌రోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు కేర‌ళ‌లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వైద్య బృందాన్ని పంపాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ అంటు వ్యాధుల నియంత్ర‌ణ సంస్థ డైరెక్ట‌ర్ నేతృత్వంలోని ఆరుగురు స‌భ్యుల వైద్య‌ బృందం ఆ రాష్ట్రానికి త్వ‌ర‌లోనే చేరుకుంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. క‌రోనాపై పోరులో కేర‌ళ ప్ర‌భుత్వానికి ఈ బృందం స‌హాయ‌ప‌డ‌నుంది.

జులై 31, ఆగ‌స్టు 1న లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు వివ‌రించింది. క‌రోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్ష‌ల విధింపుపై మ‌ళ్లీ నిర్ణ‌యం తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా కేర‌ళ‌లో ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మ‌ర‌ణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి 20 వేలకు పైగా కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో కేర‌ళ స‌ర్కారు లాక్‌డౌన్ విధించాల‌ని ఈ రోజు నిర్ణ‌యం తీసుకుంది.  

ఇది కూడా చదవండి: ఇండియా లో కొత్తగా 43,509 కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement