Saturday, April 20, 2024

బీహార్‌లో మే 15 వరకు లాక్‌డౌన్

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బీహార్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. మే 4 నుంచి ఈ నెల 15 దాకా రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆయన మంగళవారం ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో మంగళవారం ఉదయం వైద్య నిపుణులు, క్రైసిస్ మేనేజ్‌మెంట్ సభ్యులతో చర్చించిన అనంతరం సీఎం నితీష్ కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వారి సూచనలు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. సోమవారం బీహార్‌లో 11,407 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 82 మంది చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement