Tuesday, April 23, 2024

క‌రోనాతో సింహం మృతి..!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా త‌మిళ‌నాడులోని అరిగ్‌న‌ర్ అన్నా జూపార్క్‌లో ఓ మగ సింహం చ‌నిపోయింది. గ‌త వారం ఈ సింహం అనారోగ్యానికి గురైంది. దానిని చూసి క‌రోనా సోకిన‌ట్లు అనుమానించిన సిబ్బంది.. శాంపిల్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు. అక్క‌డే ఉన్న ఇత‌ర సింహాల శాంపిళ్లు కూడా పాజిటివ్‌గా తేలిన‌ట్లు జూ సిబ్బంది వెల్ల‌డించారు. అయితే వాటికి క‌రోనా ఎలా సోకింద‌న్న దానిపై అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు. అయితే సింహం దీర్ఘ‌కాల వ్యాధుల‌తో చనిపోయి ఉండొచ్చ‌ని ఓ జూ అధికారి చెప్పారు. రెండో శాంపిల్‌ను ఇన్‌స్టిట్యూట్‌కు పంపిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. గ‌త నెల‌లో హైద‌రాబాద్ జూలో కూడా 8 సింహాల‌కు క‌రోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. అయితే ఆ సింహం కోలుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement