నల్లబెల్లి, (ప్రభ న్యూస్) : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురంలోని ఓ తాటిచెట్టుపై ఇవ్వాల (సోమవారం) పిడుగుపడింది. దీంతో తాటిచెట్టు మొగులు మొత్తానికే పడిపోయింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక.. అదే మండలం రుద్రగూడెం దగ్గర మరో పిడుగుపడింది. ఆ గ్రామ సమీపంలో గొర్రెలను మేపుతున్నారు. దీంతో ఆ ప్రదేశంలో పిడుగుపడడంతో మూడు గొర్లు చనిపోయాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత గొర్రెల కాపరులు కోరుతున్నారు.
Breaking: వరంగల్ జిల్లాలో రెండుచోట్ల పిడుగుపాటు.. తాటిచెట్టుకు అంటుకున్న మంటలు
Advertisement
తాజా వార్తలు
Advertisement