Wednesday, March 27, 2024

ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అకాల వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా మరో వైపు అకస్మాత్తుగా కురిసే అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు , ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశ ం ఉందని పేర్కొంది.

ఈ మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణశాఖ జారీ చేసింది. గంటకు 3-04- కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వర్షాలు కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని, చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దని అధికారులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement