Wednesday, April 24, 2024

2024లో దేశం నుంచి బీజేపీని తరిమికొడదాం : సీఎం కేజ్రీవాల్

2024లో దేశం నుంచి బీజేపీని తరిమికొడదామని, బీజేపీ పాలనతో జనం విసిగిపోయారని ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. అన్ని దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, సింగపూర్‌, జపాన్‌ కన్నా మనం ఎందుకు వెనుకబడి ఉన్నామన్నామన్నారు. బీజేపీ పాలనలో దేశ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆర్‌ మాకు పెద్దన్నలాంటి వారు అని, వారికి మా మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణలో కంటి వెలుగు కార్యక్రమం చాలా గొప్ప సంకల్పం అని, ఎవరికి కంటికి ఇబ్బంది వచ్చినా సీఎం కేసీఆర్‌ రెప్పలా కాపాడుతున్నారన్నారు. కంటి వెలుగు పథకం ప్రజలకు చాలా ఉపయోగకరమని, ఈ కార్యక్రమాన్ని ఢిల్లిd, పంజాబ్‌ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామన్నారు. ఇవాళ రెండు బృహత్తర కార్యక్రమాల్లో పాల్గొన్నామన్నారు. 17 జిల్లాల్లో ఇప్పటికే కొత్త కలెక్టరేట్లు నిర్మించారన్నారు. సమీకృత కలెక్టరేట్లు అనే కాన్సెప్ట్‌ చాలా మంచిదన్నారు. ప్రజలకు సంబంధించిన పనులన్నీ ఒకే చోట జరుగుతాయన్నారు. ఢిల్లిdలోని ప్రతి గల్లిdలో మొహల్లా క్లినిక్‌ ఉందని.. కేసీఆర్‌ స్వయంగా వచ్చి మొహల్లా క్లినిక్‌లను చూశారన్నారు. అదే పథకాన్ని బస్తీ దవఖానల పేరుతో అమలు చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement