Thursday, April 25, 2024

సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తాం… సీఎల్పీ నేత భట్టి

సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్తామని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ఎలా రక్షించుకోవాలనే దానిపై భేటీలో చర్చించామని చెప్పారు. అసలు పార్టీ నేతలను కావాలని సామాజిక మాధ్యమాల్లో బద్నామ్ చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement