Friday, April 26, 2024

సరిహద్దులో కాల్పుల మోత.. ముష్కరుల ఏరివేత

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బుధవారం ​ పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు సహా పాకిస్థాన్​కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ అలియాస్ అబూ హురైరా హతమైనట్లు అధికారులు వెల్లడించారు.  భద్రత బలగాలు నిర్భంద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రత దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఎన్​కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, గత కొద్ది రోజులుగా సరిహద్దులో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ జశ్వంత్ రెడ్డి వీర మరణం పొందారు.

ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఏం చేద్దాం.. ప్రశాంత్ కిషోర్ తో రాహుల్ చర్చలు

Advertisement

తాజా వార్తలు

Advertisement