Saturday, April 20, 2024

కరోనా దెబ్బకు ప్రముఖ ఎడిటర్ మృతి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువ గా ఉంది. సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. మరి కొంతమంది ఈ మహమ్మారి బారినపడి చనిపోతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి దెబ్బకు మృతి చెందగా… తాజాగా ప్రముఖ ఎడిటర్ సీనియర్ నటి ప్రభ సోదరుడు ఎం జివి ప్రసాద్ మృతిచెందారు.

ప్రసాద్ వయసు 72 సంవత్సరాలు. కరోనా పాజిటివ్ రావడంతో మే 3న చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ప్రసాద్ చేరారు. అయితే క్రమేణా పరిస్థితి క్రిటికల్ గా మారడంతో ఆయన కన్నుమూశారు. ఇక నటి ప్రభ కు ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో చిన్న సోదరుడు ప్రసాద్. ప్రసాద్ కొన్ని తెలుగు తమిళ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement