Friday, March 29, 2024

ఆదికి జోడిగా ల‌క్ష్మీ మీన‌న్

విలక్షణ నటుడు ఆది పినిశెట్టి మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘వైశాలి’ విజయం తర్వాత దర్శ కుడు అరివళగన్‌తో కలసి ఆది పినిశెట్టి చేస్తున్న చిత్రం ‘శబ్దం’. 7ఏ ఫిల్మ్స్‌ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎస్‌. భానుప్రియ శివ సహ నిర్మాత. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొం దుతోంది. ఈ చిత్రంలో కథానాయికగా లక్ష్మి మీనన్‌ నటిస్తున్నట్లు- చిత్ర బృందం వెల్లడించింది. తాజాగా అనౌన్స్‌ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన లక్ష్మి మీనన్‌ సీరియస్‌ లుక్‌ ఆసక్తికరంగా వుంది. ఇప్పటికే విడుదల ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, కాన్సెప్ట్‌ పోస్టర్స్‌ కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సాబు జోసెఫ్‌ ఎడిటర్‌ గా మనోజ్‌ కుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా పని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement