Thursday, April 25, 2024

ఏపీలో కరోనా వైరస్ ప్రళయం.. ఒక్క తూ.గో. జిల్లాలోనే 617 కేసులు

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 35,732 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,157 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూ.గో. జిల్లాలో 617 కొత్త కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 522, చిత్తూరు జిల్లాలో 517, గుంటూరు జిల్లాలో 434, విశాఖ జిల్లాలో 417, కర్నూలు జిల్లాలో 386, అనంతపురం జిల్లాలో 297, నెల్లూరు జిల్లాలో 276, ప్రకాశం జిల్లాలో 230, విజయనగరం జిల్లాలో 154, కృష్ణా జిల్లాలో 135, కడప జిల్లాలో 112, ప.గో. జిల్లాలో 60 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 1,606 మంది కరోనా నుంచి కోలుకోగా నెల్లూరు జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖ జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లా, తూ.గో. జిల్లా, గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,37,049 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,01,327 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 28,383గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,339గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement