Wednesday, March 27, 2024

అలర్ట్.. ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,978 కరోనా పరీక్షలు నిర్వహించగా 380 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 51, కృష్ణా జిల్లాలో 44, విశాఖ జిల్లాలో 43, తూ.గో. జిల్లాలో 26, అనంతపురం జిల్లాలో 22, నెల్లూరు జిల్లాలో 21, శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 9 కడప జిల్లాలో 8, ప్రకాశం జిల్లాలో 6, ప.గో జిల్లాలో 5 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రకాశం జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,93,366 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 2083గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,189గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement