Thursday, April 25, 2024

ఏపీలో కొత్తగా 492 కరోనా కేసులు

ఏపీలో మళ్లీ భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 33,634 కరోనా పరీక్షలు నిర్వహించగా 492 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 168 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 63, చిత్తూరు జిల్లాలో 56, గుంటూరు జిల్లాలో 47, విశాఖ జిల్లాలో 46, అనంతపురం జిల్లాలో 29, నెల్లూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 20, ప.గో. జిల్లాలో 12, జిల్లాలో 12, శ్రీకాకుళం జిల్లాలో 10, కడప జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో ఇద్దరికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 256 మంది కరోనా నుంచి కోలుకోగా చిత్తూరు జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,94,536 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,727 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 2,616గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,193గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement