Friday, April 19, 2024

ఐపీఎల్‌లో ఒకే సమయంలో రెండు మ్యాచ్‌లు

ఐపీఎల్-2021లో చివ‌రి రెండు లీగ్ మ్యాచ్‌లు ఒకే స‌మ‌యానికి ప్రారంభ‌మ‌వుతాయ‌ని బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఐపీఎల్‌లో గ్రూప్ స్టేజ్‌లోని చివ‌రి రెండు మ్యాచ్‌లు ఒకే స‌య‌మానికి ప్రారంభం కానుండ‌టం ఇదే తొలిసారి. షెడ్యూల్ ప్ర‌కారం చివ‌రి రోజు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య మ్యాచ్ మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. సాయంత్రం 7:30 గంట‌ల‌కు ఢిల్లీ, బెంగ‌ళూరు మ్యాచ్ ఉంది. అయితే ఇప్పుడీ రెండు మ్యాచ్‌లూ సాయంత్రం 7:30కే ప్రారంభ‌మ‌వుతాయ‌ని బోర్డు స్ప‌ష్టం చేసింది.

గ్రూప్ స్టేజ్‌లో చివ‌రి రోజు అంటే అక్టోబ‌ర్ 8న మ‌ధ్యాహ్నం మ్యాచ్‌ను కూడా సాయంత్ర‌మే నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇక 2023-2027 వ‌ర‌కూ ఐపీఎల్ మీడియా హ‌క్కుల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను కూడా బీసీసీఐ రిలీజ్ చేసింది. అక్టోబ‌ర్ 25న రెండు కొత్త జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన వెంట‌నే మీడియా హ‌క్కుల‌కు సంబంధించిన టెండ‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement