Friday, April 19, 2024

Breaking : భూ త‌గాదా.. పెద్ద నాన్న‌ను చంపి త‌లా.. మొండెం వేరువేరు ఊర్ల‌లో..!

భూ తగాదా ఒకరి ప్రాణం తీసింది. భూముల కోసం అయిన‌వారినే హ‌త్య‌చేస్తున్న ఘ‌ట‌న ఏదో ఒక చోట జ‌రుగుతూనే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఝ‌ర‌సంగం మండ‌లంలో భూమి కోసం సొంత పెద్ద నాన్న‌నే క‌డ‌తేర్చాడు కొడుకు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కొంత‌కాలంగా పెద్ద‌నాన్న, కొడుకుల మ‌ధ్య భూముల విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. మంగ‌ళ‌వారం బర్దిపూర్ గ్రామంలో పెద్ద నాన్నను న‌రికి చంపాడు కుమారుడు. త‌ల, మొండెం వేరు చేసి వేరువేరు ఊర్ల‌లో ప‌డేశాడు. మృతుడు బండ మీది చంద్రయ్య (55)గా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement