Thursday, April 25, 2024

డిజిట‌ల్ స‌ర్వేతో భూ రికార్డ్…

హైదరాబాద్‌, : త్వరలో భూ డిజిటల్‌ సర్వే చేస్తామని, రెవెన్యూ అధికారులకు ఖచ్చితమైన జాబ్‌ చార్ట్‌ రూపొందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ధరణి విజయవంతంతో పేద రైతుల బాధలు తీరిపో యానని పేర్కొన్నారు. ధరణి విజయవంతంపై సీఎం కేసీఆర్‌ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్‌ సర్వే చేసి వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్‌(అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిల వాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెచ్చిన ఫలితం గా, ఈ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్‌ చార్టు రూపొందిం చనున్నట్లు వెల్లడించారు. ”రెవెన్యూ శాఖలో ఎవరేమి పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్‌ చార్టు రూపొందిస్తుంది. ఆర్‌ఐ ఏం చేయాలి? తహసీల్దార్‌ ఏం చేయాలి? ఆర్డీవో ఏం చేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఇస్తాం. రెవెన్యూ అధికారులను పనిచేయగలిగే, పని అవసరం ఉండే చోట ప్రభుత్వం వాడుకుంటుంది” అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్‌ నూటికి నూరు పాళ్లు విజయవంతమైందని సీఎం కేసీఆర్‌పూర్తి సంతృపిన్తి వ్యక్తం చేశారు. రెనెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్‌ పనితీరుపై సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సిీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్‌, భూపాల్‌ రెడ్డి తదితరులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను ఆయన ప్రకటించారు.
ధరణి రాకతో రెవెన్యూలో అవినీతి అంతం…
”ధరణి పోర్టల్‌ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమైంది. నోరులేని, అమాయకుల రైతులకు న్యాయం జరిగింది. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగింది. జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగింది. డాక్యుమెంట్లు గోల్‌మాల్‌ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం పోయింది. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం ఎన్నో వ్యయ, ప్రయాసల కోర్చి మూడేళ్లు కసరత్తు చేసి కొత్త చట్టం తెచ్చింది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా జరిగిపోతున్నాయి. ఎలాంటి గందరగోళం, అస్తవ్యస్తం లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. బయోమెట్రిక్‌, ఆధార్‌ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతు న్నది. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నది. ఆ భూములు మాత్రమే వారసత్వం ద్వారా, గిప్ట్ డీడ్‌ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న పకడ్బందీ వ్యూహం వల్ల ఎవరూ ధరణిలో వేలుపెట్టి మార్పులు చేసే అవకాశం లేదు. చివరికి సీసీఎల్‌ఏ, సీఎస్‌ కూడా రికార్డులను మార్చలేరు. అంతావ్యవస్థానుగత పద్దతిన, మానవ ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతున్నది. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సజావుగా సాగడం కొందమందికి మింగుడు పడడం లేదు. ధరణి పోర్టల్‌ మీద చిలువలు, పలువలు ప్రచారం చేస్తున్నారు. అసంబద్ధ మైన విషయాలు మాట్లాడుతున్నారు. లేని సమస్యలు సృష్టించి, పైరవీలు చేసి అక్రమంగా సంపాదించుకునే వారు ఇప్పుడు అవకా శం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారే అపోహలు సృష్టించి గందరగోళ పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి ప్రజ లు తికమక పడొద్దు. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, అసంబద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ వార్తలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలి. సందేహాలను నివృత్తి చేయాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
మిగిలిన సమస్యలు డిజిటల్‌ సర్వేతో దూరం
”ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుపుస్తకాలు, ధరణి పోర్టల్‌ తదితర సంస్కరణ వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన కొద్ది పాటి సమస్యలు కూడా ప్రభుత్వం త్వరలో జరిపే డిజిటల్‌ సర్వే వల్ల పరిష్కారం అవుతాయి. నేను అసెంబ్లిdలో ఇంతకుముందే ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ సర్వే నిర్వహిస్తాం. ప్రతి భూమికి కో ఆర్డినేట్స్‌ ఇస్తాం. వాటిని ఎవరూ మార్చలేరు. గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదు. నిజానికి ఇప్పటికే డిజిటల్‌ సర్వే ప్రారంభం కావాల్సింది. కరోనా వల్ల ఆగింది. అతి త్వరలోనే డిజిటల్‌ సర్వే ప్రారంభం అవుతుంది. ఒకసారి సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. రైతుల భూముల మధ్య, అటవీ- ప్రభుత్వ భూముల మధ్య, అటవీ, ప్రైవేటు భూముల మధ్య #హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుంది. పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. 3, 4 నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయి. కో ఆర్డినేట్స్‌ మారవు కాబట్టి భవిష్యత్తులో కూడా హద్దుల పంచాయతీకి అవకాశం ఉండదు. భూ రికార్డులు సక్రమంగా ఉన్న దేశాల్లో జీడీపీ 3, 4 శాతం వృద్ధి సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి విప్లవాత్మక మార్పుకు ప్రభుత్వం సిద్ధపడింది” అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.
రెవెన్యూ సిబ్బందికి జాబ్‌చార్ట్‌…
”మారిన పరిస్థితుల్లో రెవెన్యూ స్వరూపం కూడా మారింది. రెవెన్యూ శాఖ విధులు, బాధ్యతల్లో మార్పులు వచ్చాయి. గతంలో భూమి శిస్తు వసూలు చేసినప్పుడు రెవెన్యూ అనే పదం, శాఖ వచ్చాయి. ఇప్పుడు రెవెన్యూ వసూలు చేయకపోగా, ప్రభుత్వమే రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.10 వేల సాయం అందిస్తున్నది. కాబట్టి రెవెన్యూ అనే పేరు కూడా ఇప్పుడు సరిపోదు. పేరు మారే అవకాశం ఉంది. ధరణి పోర్టల్‌, డిజిటల్‌ సర్వే తదితర కారణాల వల్ల భూ రికార్డుల నిర్వ#హణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా సులభంగా, అధికారుల ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. సేద్యం చేసే పంటలు పండించాల్సిన రైతులు త#హశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాస ఉండదు. ఇదే ధరణి ప్రధాన లక్ష్యం కూడా. కాబట్టి రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యం. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే రైతులు ఇకపై కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్లు ఆ దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలి” అని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

భూ రీస‌ర్వేకి మార్గం సుగ‌మం…

రాష్ట్రంలో మరో కీలక ముందడుగు పడుతోంది. త్వరలోనే భూముల డిజిటల్‌ సర్వేకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలపడంతో వ్యవసాయ భూములకు ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పక్కా హద్దులు నిర్ణయించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో ఇచ్చిన హామీల అమలు దిశగా దృష్టిసారించిన సీఎం కేసీఆర్‌ కొత్త ఏడాదిలో సరికొత్త పంథాను అనుసరించేందుకు సిద్దమయ్యారు. రెవెన్యూ పాలనలో విప్లవాత్మక తీరుతెన్నులను 2020లో తీసుకొచ్చిన సర్కార్‌ కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. టైటిల్‌ గ్యారంటీ చట్టానికి చేరువవుతూనే ఈ ఏడాదిలో దశాబ్దాల కాలపునాటి భూ రికార్డులను ఆధునీకరించే మహత్తర లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమగ్ర భూ రీ సర్వే వైపుగా సన్నద్దమవుతోంది. తెలంగాణకు వివాదాలు లేని సరిహద్దుల కల్పన దిశగా సర్కార్‌ అడుగులు వేస్తున్నది. భూరికార్డుల సరిజేతతో వ్యవస్థలో మార్పు రాదని, సమగ్ర భూ సర్వేతోనే భూ రికార్డులకు మహర్ధశ సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. వెంటనే టెండర్లు పిలవాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో త్వరలో రీ సర్వేకు మార్గం సుగమమవుతున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్‌ పురాతన భూ రికార్డులను సమస్తం ఆధునీకరించి తెలంగాణకు వివాదాలు లేని సరిహద్దుల దిశగా రెవెన్యూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఇప్పుడు తాజాగా అదేఒరవడిని కొనసాగిస్తూ 1940 దశకంలో జరిగిన పురాతన సర్వేను నేటి కాలానికి అనుగుణంగా రీ సర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే భిన్నమైన రెవెన్యూ వ్యవస్థ ఉన్న తెలంగాణలో ఈ సర్వేద్వారా తన ప్రత్యేకతను చాటాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఈ ఏడాదిలో ఎలాగైనా సకల జాగ్రత్తలతో సమగ్ర భూ సర్వేకు వెళ్లాలని భావిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ఇకపై ఎలాంటి వివాదాలు లేని సమగ్ర రెవెన్యూ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.
పాత రికార్డులే ఆధారం…
నేటికీ తెలంగాణలో నిజాం కాలపునాటి రికార్డులే ప్రామాణికంగా మారాయి. బ్రిటీష్‌ కాలంలో జరిగిన భూ సర్వే మినహా ఏనాడూ సమగ్ర భూ సర్వే జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సర్వే సంపుటి ప్రకారం 40 ఏళ్లకు ఒకసారి రీ సర్వే జరగాలని ఉండగా. దశాబ్దాల క్రితం నిర్వహించిన సర్వేలో రూపొందించిన రికార్డులు లభ్యం కావడంలేదు. దీంతో భూ రికార్డుల లభ్యత, వాస్తవ స్థితి, డిజిటలైజేషన్‌కు అడ్డంకిగా మారింది. దీంతో మరోసారి సమగ్ర భూసర్వేతో గ్రామ మ్యాపులు, ఎఫ్‌ఎంబీలు, ఆర్‌ఎన్‌ఆర్‌లు, భూమి రిజిస్టర్లు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకుగానూ రూ. 600నుంచి రూ. 800కోట్ల వ్యయం కానుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర సాయమేదీ లేకుండానే సొంతంగా సర్వేకు వెళ్లాలని తెలంగాణ సర్కార్‌ ప్రాథమికంగా నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement