Friday, April 19, 2024

చంద్రబాబు, లోకేష్‌పై మండిపడ్డ లక్ష్మీపార్వతి

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మరోసారి మండిపడ్డారు. వైఎస్ఆర్ చనిపోయి 12 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆయన బతికి ఉంటే అన్న మాట వినిపిస్తునే ఉంటుందని.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ప్రజల కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ మాటలు వింటుంటే వీళ్ళు నాయకులు ఎలా అయ్యారనే అనుమానం వస్తుందన్నారు.

లోకేష్ స్థాయి ఏంటో అందరికీ తెలుసు అని.. అతడు ఏడో తరగతి ఫెయిల్ అయిన వెధవ, మూర్ఖుడని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన పుత్రరత్నం మాట్లాడుతున్న మాటల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తోందన్నారు. తమ నాయకుడు జగన్ ఒక్క సైగ చేస్తే చాలు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జగన్‌ను విమర్శించే నైతిక హక్కు తండ్రి, కొడుకులు ఇద్దరికీ లేదని నిప్పులు చెరిగారు. ఒక్క కేసు విచారణ చేస్తే చాలు తండ్రి, కొడుకులు ఇద్దరికీ 100 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

ఈ వార్త కూడా చదవండి: తండ్రి బాటలో సీఎం జగన్‌: సజ్జల

Advertisement

తాజా వార్తలు

Advertisement