Thursday, April 25, 2024

శ‌బ్ధంలో లైలా…

దర్శకుడు అరివళగన్‌తో కలసి ఆది పినిశెట్టి నటిస్తున్న చిత్రం ‘శబ్దం’. 7ఏ ఫిల్మ్స్‌ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎస్‌ బానుప్రియ శివ సహ నిర్మాత. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా లక్ష్మి మీనన్‌ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో సీనియర్‌ హీరోయిన్‌ లైలా కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రకటించారు. ఇందులో మునుపెన్నడూ చూడని పాత్రలో లైలా కనిపించనుంది. ఈ చిత్రం కోసం అరుణ్‌ బత్మనాభన్‌ కెమెరామెన్‌ గా పని చేస్తుండగా, ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement