Friday, March 29, 2024

ఎల్ రమణకు గులాబి కండువా కప్పిన కేసీఆర్..

 తెలంగాణ టీడీపీ మాజీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే..అయితే నేడు సీఎం కేసీఆర్ రమణకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ర‌మ‌ణ‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు కూడా గులాబీ గూటికి చేరారు. ఇటీవ‌లే టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇక అంతకుముందు గన్‌పార్క్‌ వద్ద అమరులకు నివాళులర్పించిన రమణ..అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అందరితో కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాభివృద్ధిలో పాల్పంచుకుంటానని అన్నారు.

ఇది కూడా చదవండి: అమేజింగ్.. చేతి వేళ్ల చెమటతో ఛార్జింగ్ చేసుకునే పరికరం

Advertisement

తాజా వార్తలు

Advertisement