Wednesday, April 24, 2024

మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి.. సీఎం కేసీఆర్​ ఆశీస్సులు అందుకున్న కూసుకుంట్ల

మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్​ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. శాలువాతో సత్కరించి దీవించారు. కాగా, మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను కేసీఆర్ అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని, వారి నమ్మకాన్ని కాపాడుకునేలా అభివృద్ధి పనులు చేసి ఆదరాభిమానాలు పొందాలన్నారు.

మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్​ మంత్రి జగదీశ్​రెడ్డికి సూచించారు. సంబంధిత శాఖల మంత్రులు.. అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జగదీశ్ రెడ్డిని ఆదేశించారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సీఎం కేసీఆర్ ను కలిసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement